Latest Posts

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం..

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో పాటు గవర్నర్ వ్యవస్థపై శరద్ పవార్ తో చర్చించారు. ఆర్డినెన్స్ పార్లమెంట్ లో చట్టరూపం దాల్చకుండా….

‘మా ‘ అసోసియేషన్ కీలక నిర్ణయం

‘మా’ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సినీ నటి కరాటే కల్యాణి సభ్యత్వం రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టులో కరాటే కల్యాణి పిటిషన్ దాఖలు చేసింది.. ఎన్టీఆర్ విగ్రహ….

హీరోయిన్ డింపుల్ న్యాయవాది కీలక వ్యాఖ్యలు

సినీ హీరోయిన్ డింపుల్ హయాతి న్యాయవాది పాల్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డింపుల్ పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. డీసీపీ తన డ్రైవర్ ను కాపాడుకునేందుకు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని తెలిపారు. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేస్తున్నారని….

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదాకు టీఎస్ హైకోర్టు నిరాకరణ

తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదాకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 36 మంది అభ్యర్థులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇప్పటికిప్పుడు….

హైదరాబాద్ రాజేంద్రనగర్‎లో ఆర్టీసీ బస్సు బీభత్సం

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. షాదన్ కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో రెండు కార్లతో పాటు….

కేసీఆర్ మీద అపార నమ్మకం.!మహారాష్ట్ర నుంచి వెల్లువలా చేరికలు.!

మహారాష్ట్ర/హైదరాబాద్ : దేశ సమగ్ర వికాసమే లక్ష్యంగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి వలసల వెల్లువ కొనసాగుతుంది. మహారాష్ట్ర నుండి ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు, పలు జిల్లాల నుంచి మాజీ జడ్పీ చైర్మన్లు, మున్సిపల్, మాజీ….

మోదీ ప్రసంగానికి సిడ్నీ జేజేలు..ఏం చెప్పారంటే..?

సిడ్నీ: భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు రోజురోజుకూ మెరుగవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సిడ్నీలో భారత సంతతి వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కామన్‌వెల్త్, కర్రీ, క్రికెట్ ఈ మూడు దేశాలను కలుపుతున్నాయని చెప్పిన ప్రధాని… ప్రపంచంలో ఎక్కడ ఆపద….

ఈ-సిమ్ కార్డుతో మోటరోలా ఎడ్జ్ 40..

మోటోరోలా ఎడ్జ్‌ 40 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో మంగళవారం విడుదలైంది. ఈ ఫోన్‌ను (Motorola Edge 40)ను ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఏసియా- పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్లలో ఏప్రిల్ నెలలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇండియాలో బేస్‌ వేరియంట్‌ను తీసుకొచ్చారు. మోటరోలా ఎడ్జ్‌40….

పద్దతి మార్చుకుంటే మీకే మంచింది, ఢిల్లీ డీల్ గురించి తెలుసుకో, డీకేఎస్ స్ట్రాంగ్ వార్నింగ్ !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్ని రోజులు బెంగళూరు, ఢిల్లీలో పోటీపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సమయంలో….

చిరంజీవి సీఎం అయ్యుంటే బాగుండేది: కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలపై వ్యాఖ్యలు చేసిన ఆయన జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేసింది శూన్యం అంటూ ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని….