వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలకు రేవంత్ రెడ్డి: కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. రేపు (మంగళవారం) జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు…..










