Latest Posts

AP

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నం అని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నం అని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే కీలక ప్రకటన చేసింది. ఆ తర్వాత కోర్టు చిక్కులు, కరోనా కారణంగా బ్రేక్‌లు పడుతూనే ఉన్నాయి. అయితే, కొన్ని నెలలుగా దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలిస్తామని….

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన గవర్నర్ కోటా మ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. గవర్నర్….

చంద్రుడిపై నిగూఢ రహస్యాలు

చంద్రుడిపై నిగూఢ రహస్యాలు కనుగొనేందుకు ఈ ఏడాది భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కథ ముగిసినట్లే కనిపిస్తోంది. భూమిపై నుంచి ప్రయోగించిన తర్వాత 40 రోజుల పాటు ప్రయాణం చేసి ఆగస్టు 23న చంద్రుడిపై సురక్షితంగా….

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడి

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. డిసీజ్ ఎక్స్ (Disease X) రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి పునరావృతమయ్యే నేపథ్యంలో యూకే లోని….

AP

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయం మారుతోంది. పార్టీల మధ్య పోరలో సామాజిక వర్గాల పేర్లు చర్చకు దారి తీస్తున్నాయి. చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత టీడీపీ(TDP) శ్రేణులు పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. చంద్రబాబు అరెస్ట్(Arrest) అక్రమం అంటూ ఆక్రోశించాయి. ర్యాలీలు చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేసారు. కానీ, ఇప్పుడు ఈ నిరసనల రూటు మారుతోంది. చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనల తో రాజకీయంగా కొత్త వివాదం మొదలైంది. వరుస పరిణామాలు: చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ(TDPకి అనుకూలంగా నిలిచే ఒక ప్రధాన సామాజిక వర్గ నిరసనలుగా ప్రచారం సాగుతున్నాయి. అదే సమయంలో వైసీపీ, ఆ పార్టీకి అండగా నిలుస్తారని భావించే మరో ప్రధాన సామాజిక వర్గంకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలే..కనిపిస్తున్న ఫ్లెక్సీలు ఈ చర్చకు కారణంగా నిలుస్తున్నాయి. చంద్రబాబుకు మద్దతుగా ఏపీ(AP)తో పాటుగా తెలంగాణ, బెంగళూరు, చెన్నై, ఇతర దేశాల్లోనూ నిరసన ర్యాలీలు జరిగాయి. అయితే, తొలుత ఈ ర్యాలీలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించినట్లు అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, క్రమేణా ఈ మద్దతు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకటనలపై అభ్యంతరం: చంద్రబాబుకు మద్దతు పేరుతో కొందరు చేస్తున్న ప్రకటనలు..తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో(AP Politics) ఆసక్తి కరంగా మారాయి. చంద్రబాబుకు మద్దతుగా కార్ల ర్యాలీ చేస్తున్నవారికి 50శాతం ఫుడ్‌ సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించిన సూర్యాపేట వద్దనున్న ఒక హోటల్ ప్రకటించింది. గతంలో ఇదే హోటల్ కు చెందిన వ్యక్తి చంద్రబాబు(Chandra Babu)కు అనుకూలంగా పోస్టులు చేసారు. ప్రభుత్వం, టీడీపీ వ్యతిరేకుల పైన పోస్టులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం, వైయస్సార్‌ అభిమానులు తమ కర్రీ పాయింట్ల వద్దకు రావద్దంటూ కేపీహెచ్‌బి కర్రీస్‌ పాయింట్ల సెక్రటరీ పేరుతో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఇటువంటి పోస్టులతో ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారనే చర్చ వినిపిస్తోంది. సామాజిక వర్గాల ప్రస్తావన: చంద్రబాబు అరెస్ట్ పైన నిరసనల పైన అభ్యంతరాలు లేవని..ఇలా సామాజిక వర్గాల ప్రస్తావన పైనే కొందరు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయినా ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ (Lokesh)హైదరాబాద్ లోనే ఉంటూ ఏపీ రాజకీయాలు చేస్తున్న అంశాన్ని కొందరు తెర మీదకు తీసుకొస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయం మారుతోంది. పార్టీల మధ్య పోరలో సామాజిక వర్గాల పేర్లు చర్చకు దారి తీస్తున్నాయి. చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత టీడీపీ(TDP) శ్రేణులు పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. చంద్రబాబు అరెస్ట్(Arrest) అక్రమం అంటూ ఆక్రోశించాయి…..

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే అవకాశాలు

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు జమిలి వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ ప్రక్రియ ఇప్పట్లో జరిగేలా లేదు. దీంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది…..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న కాకుండా అక్టోబర్ 1న ఆయన రాష్ట్రానికి రానున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు…..

ఒక రాష్ట్రంలో 33 మంది డీసీఎంలు, చరిత్ర మీరే తిరగరాయండి బ్రదర్, లక్కీచాన్స్ !

బెంగళూరు: ఢిల్లీలో బీజేపీతో (bjp) జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు దాదాపు చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ (congress) నేతల విమర్శలకు ఇరు పార్టీల నేతలు దీటుగా బదులిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ (congress) ప్రభుత్వంలో రచ్చరచ్చ అయిన డీసీఎం….

తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు

హైదరాబాద్: తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. సింటెక్స్ (Sintex) కంపెనీ రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనుంది. వెల్ప్‌న్‌ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్.. రూ.350 కోట్తతో తన తయారీ యూనిట్‌ను రంగారెడ్డి జిల్లాలో నెలకొల్పబోతోంది…..

AP

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్ నార్కోటిక్స్ పోలీసుల విచారణ

హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్ నార్కోటిక్స్ పోలీసుల విచారణ ముగిసింది. డ్రగ్స్ విక్రయించే రాంచందర్ తో ఉన్న సంబంధాలపై ప్రధానంగా ఆరా తీసినట్లు సమాచారం. శనివారంరోజున సమారు 6 గంటలపాటు నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసులు విచారించారు. విచారణ అనంతరం….