Category: TELANGANA

రాహుల్ గాంధీకి దమ్ముంటే ఇప్పుడు తెలంగాణ యాత్ర చేయాలి: బండి సంజయ్..

గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని… ఆయనకు దమ్ముంటే ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ యాత్ర చేయాలని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో….

మాజీ సర్పంచ్‌ల బకాయిలపై ప్రకటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

మాజీ సర్పంచ్‌ల బకాయిలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి బకాయిలకు ప్రభుత్వమే గ్యారెంటీ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో….

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చు.   వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో….

తెలంగాణలో 6 నుంచి ఒంటిపూట బడులు.. కారణం ఇదే..!

తెలంగాణలో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే పనిచేయనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆయా….

మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ..

హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి….

పాదయాత్రపై కేటీఆర్ కీలక ప్రకటన..

భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న సాయంత్రం ఆయన ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో ఎక్స్ వేదికగా అభిమానులు, నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు…..

ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేస్తా.. నాకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదు: కులగణన సమీక్షలో సీఎం రేవంత్..

గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు ఇచ్చిన హామీ మేరకే తెలంగాణలో కులగణనను నిర్వహిస్తున్నామని, సామాజిక సాధికారత కోసమే దీనిని చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం గాంధీ భవన్‌లో కులగణనపై జరిగిన….

రాజ్ పాకాలను 9 గంటల సుదీర్ఘ విచారణ.. పోలీసుల ప్రశ్నల వర్షం..

సంచలనం రేపిన జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో కేటీఆర్ బావమరిది పాకాల రాజ్ విచరాణకు హాజరయ్యారు. మోకిల పోలీస్ స్టేషన్‌కు 12 లాయర్లతో కలిసి వచ్చారు. అయితే, విచారణలో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు…..

గోరంటాల గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం..

INC:- ఆగస్టు 27 ఆదివారం రోజున గంభీరావుపేట మండల గొరంటాల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీమతి కొమిరిశెట్టి విజయ తిరుపతి వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి,గారు, ప్రారంభించారు, ఈ సందర్భంగా….

మేడారం మినీ జాతర తేదీలు ఖరారు..

తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2025 ఫిబ్రవరిలో 12 నుంచి 15 తేదీ వరకు నాలుగు రోజులు మినీ జాతరను నిర్వహించనున్నట్లు మేడారం పూజారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, మినీ మేడారం….