Latest Posts

ఆలూరులో టెండర్ల లొల్లి: వైసీపీ – టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట!

జిల్లా : కర్నూలు
సెంటర్ : ఆలూరు.

ఆలూరు, మార్చి 28:
ఆలూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ టెండర్ల విషయంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
ఈ అంశంపై టీడీపీ మరియు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది…

టెండర్ల కేటాయింపులో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఒక దశలో ఈ వాగ్వాదం తోపులాటకు దారి తీసినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

Posted Under AP
Editor