హోలీ సందర్భంగా దూల్పేట్ నాంపల్లి ప్రాంతంలో ఎన్టీఎఫ్,ఎక్సైజ్ అధికారులు 2.622 కిలోల గంజాయితో తయారుచేసిన బంగ్ను స్వాధీనం చేసుకున్నారు.మూడు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు.
గంజాయితో తయారు చేసిన బంగ్ను హోలీ వేడుకల్లో వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బేగం బజార్, చుడి బజార్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
మూడు కేసులు నమోదు చేసి నిందితులను దూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
