ఓవర్ స్పీడ్ తో ఆటో బోల్తా….

ఓవర్ స్పీడ్ తో ఆటో బోల్తా – ఇద్దరికీ గాయాలు మార్కాపురం జిల్లా కంభం పట్టణము లోని స్థానిక శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ వద్ద అతి వేగం తో వెళ్తున్న ఆటో బోల్తా పడింది.కంభం బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వైపుగా వెళ్తున్న ఆటో వేగంగా వెళ్తుండగా కుక్క అడ్డం వస్తుందని సడన్ బ్రేక్ వేయడం తో ఆటో బోల్తా పడింది. దీనితో ఆటోలో ప్రయాణిస్తున్న షేక్ ఉస్మాన్(58), షేక్ నూర్ జహన్(52) కు తీవ్ర గాయాలు కాగా కంభం ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట కు తరలించారు.

Posted Under AP
Editor