బళ్లారిలో డాక్టర్ పటేల్కు జర్నలిస్టుల ఘన సన్మానం
బళ్లారి జిల్లా KSJU ప్రెసిడెంట్ ఎర్రగుడి రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు రాయల్ సిటీ హాస్పిటల్ డాక్టర్ పటేల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జర్నలిస్టులు కలిసి డాక్టర్ పటేల్ను ఘనంగా సన్మానించారు.
ఆయన సామాజిక బాధ్యతతో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పలువురికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని జర్నలిస్టులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఆలూరు APUWJ నాయకులు గుత్తి నాగరాజు, గోపాల్ నాయుడు, అలాగే బళ్లారి జర్నలిస్టులు మళ్ళీ, ధనరాజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
