అనంతపురం జిల్లా, టౌన్.
– అనంతపురము జిల్లా పర్యటనలో భాగంగా నేటి మంగళవారం ఉదయం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బి.సి.ల రిజర్వేషన్ల పై అధ్యయనం కొరకు ఏర్పాటు చేయబడిన డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్) గారికి సాదర స్వాగతం పలికిన అనంతపురము జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ గారు.
– వీరితో పాటు చైర్మన్ గారికి స్వాగతం పలికిన వారిలో అనంతపురము ఆర్డీఓ కేశవ నాయుడు మరియు జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారిణి కుష్బూ కొఠారి ఉన్నారు
– అనంతపురము జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ భవనము నందు కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజా ప్రతినిధులు మరియు సాధారణ ప్రజల నుండి వినతులు మరియు విజ్ఞాపనలను డెడికేటెడ్ కమిషన్ గారు స్వీకరించనున్నారు.
