చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక మాట్లాడిన తొలి మాటలివీ..

అయితే తన కోసం వచ్చిన టిడిపి శ్రేణులకు ఒక సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనపై ఇంతటి అభిమానాన్ని చూపిన ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని చంద్రబాబు చెప్పుకొచ్చారు.మద్దతుగా నిలిచిన ప్రపంచంలోనే తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు ప్రసంగం సాగిందిలా.. ” తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు. అభినందనలు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడే సంఘీభావం తెలిపారు. పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. సంఘీభావం తెలపడంతో.. నేను చేసిన అభివృద్ధిని కూడా మీరు వివరించారు. నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికి రాదు. 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. చేయనివ్వను “.. నాకు మద్దతుగా నిలిచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటూ చంద్రబాబు ప్రసంగించారు. ఎటువంటి విమర్శలు, రాజకీయ అంశాలు లేకుండానే చంద్రబాబు ప్రసంగం సాగడం విశేషం.

Posted Under AP
Editor