Category: National

మోదీతో జెలెన్‌స్కీ టెలిఫోన్ సంభాషణ… పుతిన్ తో భేటీకి ముందు కీలక విన్నపం

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతు పాత్ర పోషించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చూడాలని, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో రష్యాకు గట్టి సంకేతాలు పంపాలని ఆయన ప్రధాని నరేంద్ర….

రామసేతుకు జాతీయ హోదా.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు .

రామసేతువును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టు కీలక ముందడుగు వేసింది. ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది…..

చైనాతో ద్వైపాక్షిక బంధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

భారత్, పొరుగు దేశమైన చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలు, పరస్పర సున్నితత్వం అనే మూడు కీలక సూత్రాల ఆధారంగా వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో….

టోక్యోలో ప్రధాని మోదీ.. పెట్టుబడులే ప్రధాన అజెండా..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో….

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు..!

2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన ఎన్డీయే కూటమి మళ్లీ బలంగా పుంజుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి ఏకంగా 324 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని ఇండియా టుడే-సి ఓటర్ నిర్వహించిన ‘మూడ్….

పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి ఆగంతుకుడు..!

ఢిల్లీలోని పార్లమెంట్ భవనం వద్ద భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఈ ఉదయం ఓ ఆగంతుకుడు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించి పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.  ….

‘ప్రధాని, సీఎంలు, మంత్రుల తొలగింపు బిల్లు’పై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..

జైల్లో ఉన్నవారు ప్రధాని, సీఎం, మంత్రులుగా కొనసాగకుండా కేంద్రం కొత్త బిల్లు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో నైతిక….

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు తేజం..!

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేదానిపై ఉహాగానాలకు ఇండియా కూటమి తెరదించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మన తెలుగోడు కావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   సుదర్శన్ ఎప్పుడు ఎక్కడ….

ఆ మూడు పాటిస్తేనే సంబంధాలు.. చైనా విదేశాంగ మంత్రికి జైశంకర్ సూటి సందేశం..

భారత్, చైనా మధ్య సంబంధాలు ముందుకు సాగాలంటే నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక వైఖరి అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనాకు స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాల (3ఎం) ఆధారంగానే ఇరు దేశాల బంధం కొనసాగాలని ఆయన….

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్..

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో….