అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం•••••
__________________________
క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కృషి
ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు సాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రగతి పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులతో కలిసి ఆయన రాయదుర్గం పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో ఆవరణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన క్రీడా వికాస కేంద్రాన్ని పరిశీలించారు. రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో కబడ్డీ పోటీలు ప్రారంభించారు.
రాష్ట్రంలోనీ క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు వాటిలో రాణించిన వారికి గ్రూప్ వన్ ఉద్యోగము, నివాస స్థలం,, నగదు బహుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.జగన్ హాయామంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో దాదాపు రూ.190 కోట్లు లూటీ జరిగిందని ఆరోపించారు.
బైట్స్. అనిమినీ రవి నాయుడు, రాష్ట్ర సాప్ చైర్మన్.
