Latest Posts

దాదాపు నాలుగున్నర గంటల పాటు భూమనను విచారించిన పోలీసులు..

టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది.

 

శనీశ్వరుడి విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని భూమన పోలీసులకు తెలియజేశారు. అయితే, ఆయనపై అప్పటికే అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యలు టీటీడీపై అసత్య ప్రచారంగా పరిగణించబడినందున ఈ కేసు నమోదు చేశారు.

 

డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, భూమనకు ఇటీవల నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించారు. ఆయనను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.

 

అలిపిరి సమీపంలోని శనీశ్వరుడి విగ్రహంపై ఆయన అసత్యాలు చెప్పారని, దేవుడి విగ్రహానికి అపచారం జరిగిందంటూ టీటీడీ చర్యలు చేపట్టింది. భూమన తన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని డిప్యూటీ ఈవో గోవిందరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Posted Under AP
Editor