పవన్ ఛాంబర్ రెడీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించ బోతున్నారు? ఈ వేడుకను కన్నులారా చూడాలని జనసేన, పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 19న మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.

 

పవన్ కోసం ఛాంబర్ రెడీ అవుతోంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయానికి వెళ్లారు. చివరకు రెండో బ్లాక్‌లోకి మొదటి అంతస్తులో 212 రూమ్‌ని పవన్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే అంతస్తులోని ఛాంబర్లను మంత్రులు నాదెండ్ల మనోహన్, కందుల దుర్గేష్‌కు కేటాయించనున్నారు.

 

ఈ లెక్కన జనసేనకు చెందిన ముగ్గురు నేతల గదులు పక్కపక్కనే ఉండనున్నాయి. ప్రస్తుతం ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్ రెడీ చేస్తున్నారు అధికారులు. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.

 

నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల, ఆహారం కాగా, మరో మంత్రి కందుల దుర్గేష్ కు టూరిజం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖను కేటాయించారు ముఖ్యమంత్రి. ఈ ముగ్గురు నేతలు 19న బాధ్యతలు చేపట్టనున్నారు.

Posted Under AP
Editor