బారులు తీరిన ఓటర్లు.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా..

ఏపీలో పోలింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే, సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో భారీగా క్యూలైన్లలో ఓటర్లు నిల్చున్నారు. దీంతో అర్ధరాత్రి 12 గంటలు దాటినా కొన్ని చోట్లా ఓటింగ్ జరిగింది. ఈసీ అధికారుల అంచనాల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల వరకు సుమారుగా 78.36 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం, జిల్లాల వారీగా పోలింగ్ శాతంపై అధికారుల అంచనా వివరాలు..

 

ర్యాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం..

 

ఉదయం 9 గంటల వరకు – 9.21 శాతం పోలింగ్ నమోదు

ఉదయం 11 గంటల వరకు – 23.04 శాతం పోలింగ్ నమోదు

మధ్యాహ్నం ఒంటి గంట వరకు – 40.26 శాతం పోలింగ్ నమోదు

మధ్యాహ్నం 3 గంటల వరకు – 55.49 శాతం పోలింగ్ నమోదు

సాయంత్రం 5 గంటల వరకు – 67.99 శాతం పోలింగ్ నమోదు

అర్ధరాత్రి 12 గంటల వరకు – 78.36 శాతం పోలింగ్ నమోదు( అధికారుల అంచనా)

 

జిల్లాల వారీగా పోలింగ్ శాతంపై అధికారుల అంచనా వివరాలు..

 

చిత్తూరు – 82.65 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

అనంతపురం – 79.25 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

బాపట్ల – 82.33 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

కోనసీమ – 83.19 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

అల్లూరి – 63.19 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

ప్రకాశం – 8240 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

నెల్లూరు – 78.10 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

తిరుపతి – 76.83 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

తూర్పు గోదావరి – 79.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

ఏలూరు – 83.04 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

సత్యసాయి – 82.77 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

పార్వతీపురం – 75.24 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

శ్రీకాకుళం – 75.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

అనకాపల్లి – 81.63 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

అన్నమయ్య – 76.12 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

నంద్యాల – 80.92 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

ఎన్టీఆర్ – 78.76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

ఏలూరు – 83.04 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

విశాఖపట్నం – 65.50 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

గుంటూరు – 75.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

వైఎస్సార్ – 78.71 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

కాకినాడ – 76.37 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

విజయనగరం – 79.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

కర్నూలు – 75.83 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

కృష్ణ – 82.20 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

పశ్చిమ గోదావరి – 81.12 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేసినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు ఈసీ వెల్లడించాల్సి ఉంది.

Posted Under AP
Editor