Latest Posts

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం..

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో పాటు గవర్నర్ వ్యవస్థపై శరద్ పవార్ తో చర్చించారు.

ఆర్డినెన్స్ పార్లమెంట్ లో చట్టరూపం దాల్చకుండా చేసేందుకు బీజేపీయేతర పార్టీల నాయకులను కేజ్రీవాల్ కలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, ఉద్దవ్ థాక్రేలను కేజ్రీవాల్ కలిశారు.

YES9 TV