సాసవల చిన్నమ్మ ఆలయంలో ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో ఉండే వంకరకుంట గ్రామంలో ప్రసిద్ధి చెందిన సాసవల చిన్నమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలిసి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వారికి సంప్రదాయ ఆలయ మర్యాదలతో అపూర్వ స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రజల శ్రేయస్సు కోసం సాసవల చిన్నమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో శాంతి, సుభిక్షాలు నెలకొని ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నా
