విజయవాడ, అమరావతి.
బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సీఎం నివాళులు
భారత రాజ్యాంగ శిల్పి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, అంబేద్కర్ చూపిన దారిలోనే పాలన కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గారు, లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు, పలువురు నేతలు.
