రుషికొండ భవనాల వినియోగంపై మంత్రి పయ్యావుల కేశవ్ వీడియో కాన్ఫరెన్స్: ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కేబినెట్ సబ్ కమిటీ చర్చలు!

అనంతపురం జిల్లా,రామ్ నగర్.

*రుషికొండ ప్యాలెస్‌ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు..*

– *అనంతపురం నగరంలోని రామ్ నగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం రుషికొండ భవనాల వినియోగంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు పాల్గొన్నారు.*

– *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పర్యాటక శాఖ మంత్రి వర్గులు శ్రీ కందుల దుర్గేష్ గారు, తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై ఉన్న హరిత రిసార్ట్స్‌ను ధ్వంసం చేసి వాటి స్థానంలో నిర్మించిన భవన సముదాయాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎలా ఉపయోగించాలనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ, సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.*

Posted Under AP
Editor