ఉరవకొండ మండల తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు విన్నపం
**********
మన ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్ర మాన్యశ్రీ ముఖ్యమంత్రివర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు
*శ్రీ పయ్యావుల కేశవ్ గారి ఆదేశాల మేరకు ఉరవకొండ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు
రేపు ఉదయం 9-00 గంటలకు జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడును.కావున
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు
ప్రస్తుతం మరియు మాజీ జడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు
వార్డు మెంబర్స్ మండల మరియు పట్టణ
క్లస్టర్ ఇన్చార్జులు
బూత్ కమిటీ కన్వీనర్స్ కమిటీ సభ్యులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ
ప్రతి కార్యకర్త తరలివచ్చి
జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేయుచున్నాము.
ఇట్లు
పట్టణ మరియు మండల కమిటీ
అధ్యక్షులు,ఉరవకొండ .
ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: పార్టీ శ్రేణులకు పిలుపు!
