“నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ సునీతమ్మ”

జనవరి 26 శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయం లో ఘనతంత్ర వేడుకలు ఘనంగా నిర్యహించారు నల్లమాడ మండలం ఎంపీడీఓ కార్యాలయం లో నిర్యహించిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి, మండల ఎంపీడీఓ ఇంచార్జ్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ..దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో మండల ఎంపీపీ సునీతమ్మ గారు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు

Posted Under AP
Editor