నల్లమడ మండలం కమ్మవారి పల్లికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త అమ్మినేని చెన్నప్ప అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం కమ్మవారి పల్లికి చేరుకొని కార్యకర్త మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అమ్మినేని చిన్న పమృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.
