ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టు..

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు.

 

ఈ రోజు నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలతో కెసిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

 

వైసీపీ హయాంలో మద్యం క్రయ విక్రయాల్లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో కోరడంతో పాటు ఇందుకు సంబంధించిన వివరాలను హోంమంత్రి అమిత్ షా‌ను కలిసి అందించారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది.

Posted Under AP
Editor