నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత.

రాష్ట్రంలో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 31,383మంది అభ్యర్థులు రాయనున్నారు.

 

మొత్తం రాష్ట్రంలో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా.. ఆయా పరీక్ష కేంద్రాలను కలెక్టర్లు, పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ ప్రకటించారు.

 

పరీక్షలు జరుగుతున్న సమయంలో ఆయా కేంద్రాల నుంచి 200మీ. దూరం వరకు ఆంక్షలు విధించారు. మరోవైపు గ్రూప్ 1 నోటిఫికేషన్‌లోని జీఓ 29 రద్దు చేసి పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని గత కొంతకాలంగా అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

 

జీఓ రద్దు, పరీక్షల తేదీలను మార్చమని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కొంతమంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా..కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది.

Editor