బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో ప్రభావవంతమైన నాయకులు అపార్ట్ మెంట్ నిర్మించారు. అపార్ట్మెంట్ యజమానులకు సౌకర్యాలు కల్పించేందుకు హోసకరెహళ్లి చెరువును విభజించి మధ్యలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును ప్లాన్ చేసి అమలు చేసిన అధికారులు, ఇంజనీర్లందరినీ సస్పెండ్ చేయాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ను ఆదేశించారు.
మేనమామ భార్యతో మస్త్ మజా, అర్దరాత్రి మిడ్ నైట్ మసాలా, స్పాట్ లో ఫినిష్ !
ఈ చెరువు మధ్యలో రహదారిని నిర్మించాలనే ఆలోచన ఎవరు ఇచ్చారు? ప్లాన్ చేసింది ఎవరు? ఎవరు అమలు చేశారు? ఎందుకు ఇలా చేసారు? మీరు ఎవరికి సహాయం చేసారు? ఇందులో ఎవరెవరి హస్తం ఉంది అని సోమవవారం బెంగళూరులో జరిగిన బీబీఎంపీ అధికారుల సమావేశంలో డీసీఎం డీకే. శివకుమార్ అధికారులను ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పేందుకు అధికారులు తడబడ్డారు. వెంటనే హొసకెరెహళ్లి చెరువును విభజించి రోడ్డు వేసిన అధికారులను సస్పెండ్ చేయాలని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాలు జారీ చేశారు.
