Latest Posts

వేదావతి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలి: ఆలూరు రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్

కర్నూలు జిల్లా ఆలూరు మండలం లో వేదవతి ప్రాజెక్టు పై సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రాజెక్టులకు చంద్రబాబు ఈ మూడు సంవత్సరాల కాలానికి 90 వేల కోట్లు ప్రాజెక్టులకు కేటాయిస్తే రాష్ట్రంలో ఎక్కడ గాని ఏ నీటి సమస్య ఉండదని వారన్నారు అయితే ఏ ఒక్క నాయకుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వీరిని విమర్శించడం మా పని కాదు కేవలం రాష్ట్రంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది న్యాయం చేయమని మేము అడుగుతున్నాం రాష్ట్రంలో గ్రామాల్లో తాగినీటి సమస్య తీర్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు కాబట్టి ఈ వేదవతి ప్రాజెక్టు నిర్మిస్తే దాదాపు 80000 ఎకరాలకు సాగునీరు 108 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు కావున తక్షణమే చంద్రబాబు వేదావతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలన్నారు

Posted Under AP
Editor