పశ్చిమ గోదావరిలో ఫుడ్ పాయిజన్ కలకలం..

*పశ్చిమ గోదావరిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. బజ్జీలు తిని 13 మందికి అస్వస్థత*

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్‌.కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. బజ్జీలు తిన్న అనంతరం 13 మంది ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

బజ్జీలు తిన్న వెంటనే అస్వస్థత..

బజ్జీలు తిన్న కాసేపటికే వాంతులు, తల తిరగడం, అపస్మారక స్థితి వంటి లక్షణాలతో కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రులకు తరలించారు.

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్‌.కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. బజ్జీలు తిన్న అనంతరం 13 మంది ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

నలుగురిని తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు..

అస్వస్థతకు గురైన వారిలో నలుగురు బాధితులను తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ముగ్గురి పరిస్థితి విషమం..

బాధితుల్లో దీపిక, దానమ్మ, వెంకటలక్ష్మి అనే ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసరంగా భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. మిగిలిన బాధితులు కూడా భీమవరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

గ్రామంలో ఆందోళన..

ఈ ఘటనతో ఎస్‌.కొండేపాడు గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. బజ్జీల తయారీలో ఉపయోగించిన నూనె లేదా ఇతర పదార్థాల వల్లే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్లు సమాచారం.

Posted Under AP
Editor