చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టరు సుమిత్ కుమార్ సైకిల్ తొక్కి అభిమానులను అలరించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయ ఆవరణలో ఆదివారం ఉదయం ఈ-సైకిల్ ను వారు పరిశీలించారు. త్వరలోనే ఈ-సైకిళ్లను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే, కలెక్టరు
