హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం మోతీనగర్లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఇకపై ఇందిరమ్మ క్యాంటీన్లలో ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్, భోజనం లభించనుంది. ఒక్కసోమవారం 12 ఇందిరమ్మ క్యాంటీన్ల ప్రారంభించారు.
తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 29న అంటే సోమవారం హైదరాబాద్లోని మోతినగర్, ఖైరాతాబాద్ మింట్ కంపౌండ్ వద్ద వాటిని ఓపెన్ చేశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేశారు. ఆయనతోపాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వయంగా పాల్గొని వివిధ రకాల టిఫిన్లను ప్రజలకు వడ్డించారు.
