అనంత బాలొత్సవ ఐదవ పిల్లల పండుగ పూర్తి చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం క్రీసెంట్ స్కూల్ రామ్ నగర్ నందు అనంత బాలొత్సవ కమిటీ చైర్మన్ మరియు బాలొత్సవ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ నిర్ణేతలకు పాత్రికేయులకు చిరు మెమెంటో తో ఘనంగా సత్కారం గావింపబడింది..ఈ సందర్భంగా బాలోత్సవ కమిటీ చైర్మన్ శమిమ్ షేపి మాట్లాడుతూ ప్రతి ఏటా జరుగుతున్న బాలోత్సమ్ విజయవంతం చేసినందుకు గాను కార్యకర్తలకు న్యాయనిర్ణేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు..

ఇక ముందు కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించి విద్యార్థులలో ఉన్న కల ప్రతిభను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
