సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కృష్ణా జలాల ఒప్పందాలు, ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా ఎంత ఉండాలి, ఎంతకు ఒప్పందం చేసుకున్నారు. తదితర అంశాలపై తెలియజేసినట్లు చెప్పారు. కేసీఆర్ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని ఓట్ల కోసం నీటి రాజకీయాలు చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో సోమవారం తమ ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
-జగన్తో కుమ్మక్కు..
తెలంగాణ నాటి సీఎం ప్రస్తుత ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కై తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేశారని ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. కృష్ణా జలాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని తెలిపారు. జగన్, కేసీఆర్ మాట్లాడుకునే నాగార్జునసాగర్పైకి ఏపీ పోలీసులు వచ్చారని ఆరోపించారు. కేసీఆర్ చర్యలు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
-శ్వేతపత్రం సిద్ధం..
అసెంబ్లీలో సోమవారం నీటిపారుదల శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమైంది. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు, చేపిన పనులే లక్ష్యంగా ఈ ప్రజెంటేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రతివ్యూహంతో అసెంబ్లీకి రాబోతోంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు మరింత వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.
