బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (modi) ప్రచారం కోసం కొత్తకొత్త ఆలోచనలతో ముందు ఉంటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారం కోసం అనేక ప్లాన్స్ వేస్తుంటారు.
ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో చేసే విమర్శలను ఇంతకాలం ప్రధాని నరేంద్ర మోదీ (modi)దీటుగా ఎదుర్కొని వారికి దిమ్మతిరిగిపోయే షాక్ లు ఇస్తూనే ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం కోసం భారత (India) సైన్యాన్ని ఉపయొగించుకుంటున్నారని లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం (soldiers) శక్తి సామార్థ్యాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆయన సొంత పార్టీ అయిన బీజేపీ (BJP)లాభం పొందడానికి ప్రయత్నిస్తున్నారని మల్లికార్జున్ ఖార్గే ఆరోపించారు.
దేశం మొత్తం సెల్ఫీ పాయింట్ లో ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (modi) అందుకోసం భారత సైనికులను ఉపయోగించుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ( Mallikarjun Kharge) ఆరోపించారు. 75 ఏళ్ల చరిత్రలో ఏ నాయకుడు (leader), ఏ ప్రభుత్వం కూడా భారత సైనికులను సొంత పార్టీ కోసం ఉపయోగించుకోలేదని, మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ (modi0 భారత సైనికులను అలా ఉపయోగించుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఆరోపించారు.
బీజేపీ (BJP) అధ్వర్యంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్ డీఏ (NDA) ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం భారతదేశంలో 882 సెల్ఫీ పాయింట్ లు (selfie point) ఏర్పాటు చెయ్యాలని భారత సైన్యంకు సూచించిందని, ఇలా భారత సైనికులను కేంద్ర ప్రభుత్వం ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే (Mallikarjun Kharge)ఆరోపించారు.
వీర సైనికులకు ప్రచారం ఇచ్చే ముసుగులో ప్రధాని నరేంద్ర మోదీ (modi) కేంద్ర ప్రభుత్వం లాభం పొందేలా చూడటానికి వారిని ప్రచారం కోసం ఊపయోగించుకుంటున్నారని, భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులను (soldiers) ఇలా ఉపయోగించుకోవడం చాలా దారుణంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే విమర్శించారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, బీజేపీ (BJP) నాయకులు కౌంటర్ ఇవ్వడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది.
