దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో పాటే మరణాల రేటు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిఫా వైరస్ శాంపిల్స్ పై అధ్యయనం చేస్తున్న ఐసీఎంఆర్ ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసింది.
దేశంలో నిఫా వైరస్ కారణంగా మరణాల రేటు తీవ్రంగా ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది. దీంతో పాటే ప్రజలకు సురక్షితంగా ఉండేందుకు పలు సూచనలు కూడా చేసింది.
కేరళ తీర ప్రాంతాన్ని నిపా వైరస్ భయాందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో కోవిడ్లో మరణించిన వారితో పోలిస్తే ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 2 నుంచి 3 శాతం ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే కేరళలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని ప్రయత్నాలూ కొనసాగుతున్నాయని ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బహ్ల్ తెలిపారు. రోగులందరూ ఇండెక్స్ పేషెంట్తో కాంటాక్ట్ లుగా ఉన్నారని ఆయన చెప్పారు.
మెదడును దెబ్బతీసే ఈ నిఫా వైరస్ కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తుల మరణాలకు కారణమైంది. అలాగే మరో ముగ్గురికి కూడా సోకింది. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన కేంద్ర బృందం కోజికోడ్ జిల్లాకు చేరుకుని పరిస్థితిని అంచనా వేసి సహాయక చర్యలను ప్రారంభించింది. అలాగే నిపా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి కూడా ఐసీఎంఆర్ అధికారి పలు సూచనలు చేశారు. పదే పదే చేతులు కడుక్కోవాలని, ఫేస్ మాస్క్లు ధరించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.
నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాటించాల్సిన పలు చర్యల్ని ఐసీఎంఆర్ వివరించింది. ఇందులో తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం ముఖ్యమైనవి. అలాగే అత్యంత ముఖ్యమైనది మానవ రోగితో కాంటాక్ట్ సమయం. మొదటి రోగి ఎక్కడి నుండైనా దాన్ని పొందుతాడని, ఇతరులు ఆ రోగి యొక్క కాంటాక్టులుగా ఉంటారని తెలిపింది. మూడవ అతి ముఖ్యమైన విషయం దూరంగా ఉండటం లేదా శరీరానికి ద్రవాలు, రక్తం అంటకుండా చూసుకోవడం.
