హత్య కేసుల్లో మరణం వాంగ్మూలం ఆధారంగా దోషుల్ని నిర్ధారించడం దశాబ్దాలుగా మన దేశంలో కొనసాగుతోంది. అయితే ప్రతీ సందర్భంలోనూ మరణ వాంగ్మూలాల ఆధారంగా దోషుల్ని నిర్ధారించాలా లేక ఇందులో ఏదైనా మినహాయింపు ఉంటుందా అన్న అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతిసారీ మరణ వాంగ్మూలం దోషిత్వం నిర్ధారణకు ఆధారంగా చెల్లదని తేల్చిచెప్పేసింది. దీంతో ఇప్పటివరకూ ఉన్న ఈ అపోహకు చెక్ పెట్టినట్లయింది.
హత్యకు గురైన బాధితురాలి మరణ ప్రకటనలే నిందితుడిని దోషిగా నిర్ధారించడానికి ఏకైక ఆధారం కాదని సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టం చేసింది. 2014లో ముగ్గురి హత్య కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు.
మరణిస్తూ ఇచ్చిన డిక్లరేషన్లపై ఆధారపడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సూచించింది. న్యాయస్థానాలు నిజాయితీని అంచనా వేస్తాయిని, కోర్టు మరణిస్తూ ఇచ్చిన డిక్లరేషన్లపై చట్టపరమైన సూత్రంతో వ్యవహరించిందని గుర్తుచేసింది.
అలాగే మరణశయ్యపై ఉన్న వ్యక్తి అబద్ధం చెప్పడనే నమ్మకాన్ని ఇది స్పష్టంచేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. మరణిస్తున్న వ్యక్తి ఇచ్చే డిక్లరేషన్ నిజం అనే భావన కలిగి ఉందని పేర్కొంది. ఇది పూర్తిగా విశ్వసనీయంగా ఉండాలని, విశ్వాసాన్ని ప్రేరేపించాలని, దాని యథార్థతపై ఏదైనా అనుమానం ఉంటే లేదా రికార్డులో ఉన్న ఆధారాలు మరణిస్తూ ఇచ్చిన వాంగ్మూలం నిజం కాదని చూపిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పుడు ఇది ఒక సాక్ష్యంగా మాత్రమే పరిగణించబడుతుందని వెల్లడించింది. కానీ నేరారోపణకు మాత్రమే ఆధారం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
హత్యకు గురైన వ్యక్తి మానసిక స్ధికి సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మరణిస్తూ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆమోదించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. తన కుమారుడు ఇస్లాముద్దీన్, ఇద్దరు సోదరులను హత్య చేసిన కేసులో దోషిగా తేలి గత ఎనిమిదేళ్లుగా జైలులో ఉన్న ఇర్ఫాన్ పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
