Latest Posts

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి; కాంగ్రెస్, టీఎంసి డిమాండ్!!

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో 278 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఒడిశాలో చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన భారత రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర, అతిపెద్ద రైలు ప్రమాద ఘటనగా మారింది.

వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షపార్టీలు, మరోవైపు అధికార బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ ఘటనకు నైతికబాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీసీఎం పృథ్వీరాజ్ చవాన్ అశ్విని వైష్ణవ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అశ్విని వైష్ణవ్ కూడా తన పదవికి రాజీనామా చేయాలన్నారు. రైలు ప్రమాద ఘటనపై విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

YES9 TV