భారత నౌకాదళం స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించింది. స్వావలంబన భారత్లో భాగంగా భారత నౌకాదళం ఆదివారం (మార్చి 05) బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని బూస్టర్ను DRDO రూపొందించింది. అరేబియా సముద్రంలో తన లక్ష్యంపై కచ్చితంగా దాడి చేసింది. బంగళాఖాతంలో ఈ పరీక్షను ఎయిర్ఫోర్స్ నిర్వహించింది. బంగాళాఖాతంలోని 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకపై లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా చేధించినట్టు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. నావికాదళం విడుదల చేసిన ఒక ప్రకటనలో, “భారత నావికాదళం DRDO రూపొందించిన స్వదేశీ సాధక్, వర్ధక్ బ్రహ్మోస్ క్షిపణులతో అరేబియా సముద్రంలో ఖచ్చితమైన దాడి చేసింది. ఇది స్వావలంబన పట్ల నిబద్ధతను బలపరుస్తుంది. కోల్కతా క్లాస్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ వార్షిప్ నుంచి క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటన పేర్కొంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ క్షిపణిలో స్వదేశీ పదార్థాలను పెంచేందుకు నిరంతరం కృషి చేస్తోంది.
బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించిన భారత నౌకాదళం..
