Latest Posts

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. స్థానిక కాలమనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య అక్కడితో ఆగే అవకాశాలు దాదాపుగా లేవు. అంతకంతకూ మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రాకెట్ దాడుల్లో 1,600 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. గాజా స్ట్రిప్‌లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 240 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఇజ్రాయెల్‌లోని అనేక స్థానాలను హమాస్ ఉగ్రవాదులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అక్కడ తమ చేతికి చిక్కిన ఇజ్రాయెలీలను గాజా స్ట్రిప్‌కు తరలించడం మొదలు పెట్టారు. వందలాది మంది ఇజ్రాయెలీలను వారు బందీలుగా పట్టుకున్నట్లు మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పారు.

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ….

గన్‌మెన్ చెంప పగలకొట్టిన హోంమంత్రి..తప్పని వారించిన మరో మంత్రి..వీడియో వైరల్

తెలంగాణ మంత్రులు ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే మంత్రి తలసాని ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సమయంలో మంత్రి కేటీఆర్ పక్కన నడుస్తున్న బైంసా అగ్రికల్చర్‌….

AP

వైసీపీలో `పులివెందుల` సతీష్ రెడ్డి: చేరిక తేదీ ఇదే..!!

కడప: ఏపీ.. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఏప్రిల్/మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది. ఈ పరిస్థితుల….

AP

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మరో కార్యక్రమానికి పిలుపు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మొన్న మోత మోగించగా, రేపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు,….

AP

ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం..!!

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్కకు తెలంగాణ సచివాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును పోలీసులు అడ్డుకున్నారు. కారుతో సహా సచివాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. ప్రధాన ద్వారం వద్దే కారును నిలిపివేశారు…..

అన్నం పెట్టిన ఓనర్ ను చంపేశాడు. ఇంట్లో భార్య, సెలబ్రిటీలు షాక్ !

బెంగళూరు/కలబురిగి: అతను ఆ నగరానికి చెందిన ప్రముఖ టైలర్. ప్రముఖ రాజకీయ (karnataka) నాయకులు, వ్యాపారవేత్తలు, పోలీసులు మొదలుకొని అందరూ తమ (tailor) బట్టలు ఇతని దగ్గరే కుట్టించుకుంటారు. అంత ఫేమస్ (owner) అయిన ఆ టైలర్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు…..

తెలంగాణలో ఎన్నికల సమరానికి సర్వం సిద్దం

తెలంగాణలో ఎన్నికల సమరానికి సర్వం సిద్దం అవుతోంది. ఎన్నికల సంఘం ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం టీం హైదరాబాద్ లో ఎన్నికల నిర్వహణ పైన మూడు రోజుల కసరత్తు పూర్తి చేసింది…..

ఎన్డీఏతో బంధంపై పవన్ ఏం చెప్పారు – అర్దం అవుతోందా..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. పెడన సభలో ఎన్నో ఇబ్బందులు ఉన్న ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. టీడీపీకి జనసేన కలిస్తేనే జగన్ ను ఓడించగలుతామని చెప్పారు…..

చంద్రబాబు బెయిల్ పై ఉత్కంఠ – నేడే కీలకం..!?

టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్ల పైన ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. నేడు జరిగే విచారణ కీలకం కానుంది. ఇప్పటికే మూడో సారి….

AP

అమిత్ షా తో సీఎం జగన్ కీలక భేటీ – ఇక ముందుకే..!?

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలిరోజు కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ ఈ రోజు హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సులో పాల్గొననున్నారు. ఈ రాత్రికి అమిత్ షా తో….