ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్ను (Twitter) హస్తగతం చేసుకున్న తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. పనితనం సరిగ్గా లేని ఉద్యోగులను లే ఆఫ్స్ (Layoffs) పేరుతో ఇంటికి సాగనంపడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో ఉద్యోగుల నుంచి భారీ నిరసన ఎదురైంది. కొంతమంది ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్దపడ్డారు. దీంతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన మస్క్.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను విరమించుకున్నాడు. ఇక మీదట తాను ఉద్యోగులను తొలగించబోనంటూ ఎలాన్ మస్క్ ప్రకటించాడు. మస్క్ తాజా ప్రకటన వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉద్యోగుల తొలగింపు ఉండదని, కొత్తగా ఇంజినీర్లు, సేల్స్ విభాగంలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు మస్క్ చెప్పాడు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కోడ్ను గొప్పగా రాసే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని తెలిపాడు. రిఫరల్స్ ఉంటే చెప్పాలని మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను కోరినట్లు సమాచారం. ఉద్యోగులతో ఇటీవల జరిగిన సమావేశంలో మస్క్ మాట్లాడుతూ .. టెక్నాలజీ స్టాక్లోని కీలకమైన విభాగాలను మొదటి నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఇంజనీరింగ్ బృందాలను ఒక్కతాటిపైకి తెచ్చి వికేంద్రీకరణ చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు.
సీఈఓ ఎలాన్ మాస్క్ కీలక ప్రకటన.. ఇకపై ట్విట్టర్లో లే ఆఫ్స్ ఉండవు..
