- ఉపాది మీ అక్రమాలను ప్రశ్నించిన దళితులపై తెదేపా నాయకుడు దౌర్జన్యం
- ఉపాధి హామీ అక్రమాలపై పిడీకి వివరించిన జి. హరి కృష్ణ
- తెదేపా పేరు చెప్పి దళితులపై దాడి
- ఉన్నతాధికారులను దుర్భాషలాడిన స్థానిక తెదేపా నాయకుడు
ఎస్ 9 న్యూస్
కూడేరు ఆగస్టు 4
అనంతపురం జిల్లా బ్యూరో
అనంతపురం జిల్లా ఉరుకొండ నియోజకవర్గం కూడేరు మండలం పరిధిలో
రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావు కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కూడేరు మండలంలో తెదేపా దౌర్జన్యాలు అరాచకాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. కూడేరు మండలం కలగళ్ల గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాల చోటు చేసుకున్న అంటూ ఆధారాలతో సహా స్థానిక గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయగా కలెక్టర్ విచారణకు ప్రాజెక్టు డైరెక్టర్ ను ఆదేశించారు. దాంతో ఉపాధి హామీ ఉన్నతాధికారులు కలగళ్ల గ్రామంలో మంగళవారం రోజున విచారణ చేపట్టారు. ఉపాధి హామీ అక్రమలపై విచారణ చేపడానికి వీలు లేదంటూ స్థానిక తెదేపా నాయకుడు బోయ ఈశ్వరయ్య, బోయ జయరాములు,అధికారులను దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించాడు. అదే క్రమంలోని స్థానిక గ్రామానికి చెందిన దళిత కప్పల ఎర్రిస్వామి ఉపాధి అక్రమాలను ప్రాజెక్ట్ డైరెక్టర్ కు వివరిస్తుండగా ఉపాధి హామీ అక్రమలపై పిడికే ఫిర్యాదు చేస్తావా అంటూ కులాన్ని దూషించి నానా దుర్భాషలాడుతూ ప్రభుత్వ అధికారులు అందరూ చూస్తుండగానే స్థానిక తెదేపా నాయకుడు బోయ ఈశ్వరయ్య, బోయ జయరాములు,దళిత కప్పల ఎర్రిస్వామి విచక్షణారహితంగా కొట్టి దాడికి తెగబడ్డాడు.
