అనంతపురం జిల్లా,జేఎన్టీయూ.
*ఈనెల 6వతేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటన*
– *: జేఎన్టీయూలో అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి*
– *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..*
– *: రాష్ట్ర గవర్నర్ పర్యటన నేపథ్యంలో నగరంలోని జేఎన్టీయూలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులు..*
అనంతపురం, ఏప్రిల్ 04 :
– *ఈనెల 6వతేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో నగరంలోని జేఎన్టీయూలో అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధత అధికారులను ఆదేశించారు. ఈనెల 6వతేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జేఎన్టీయూలో నిర్వహించే స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి రానున్న నేపథ్యంలో శనివారం జేఎన్టీయూలో సంబంధిత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులు పరిశీలించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ పర్యటన నేపథ్యంలో గెస్ట్ హౌస్ వద్ద, ఆడిటోరియంలో ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డయాస్ ఏర్పాట్లను జాగ్రత్తగా చేసుకోవాలన్నారు. స్ట్రక్చర్స్ భద్రతను ఆర్.అండ్.బి అధికారులు తనిఖీ చేయాలన్నారు. గోల్డ్ మెడలిస్టులు, విద్యార్థులకు పాసులను మంజూరు చేయాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.*
– *ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ సుదర్శన్ రావు, ట్రైన్ ఐపీఎస్ అశ్విన్ మనిదీప్, ఆర్డీవో కేశవ నాయుడు, డిఎస్పిలి మహబూబ్ భాషా, శ్రీనివాసరావు, జేఎన్టీయూ రిజిస్టర్ కృష్ణయ్య, ఓఎస్డి దేవన్న, పిఆర్వో ఓం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.*
