నల్లమాడ హమాలి కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీడీవో అంజనప్ప ,తెలుగుదేశం నాయకులు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం
సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం హమాలీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేశం గాని అంజనప్ప గారు, తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేశంగానే అంజన్నప్ప గారు మాట్లాడుతూ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల బడుగు బలహీన వర్గాలకు వికలాంగులు, వృద్ధులకు భరోసా కల్పించాలని ఉద్దేశంతో 2000 రూపాయల నుంచి 4000 రూపాయలు పింఛన్ పెంచడం జరిగిందని, సాధారణ పింఛన్ 4000 రూపాయలు, వికలాంగులు పింఛన్ 6000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10000 రూపాయలు, మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు 15000 ఇవ్వడం జరిగినదని, పింఛన్దారులు ఇతరుల మీద ఆధార పడకూడదని సదుద్దేశముతో సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇవ్వడం జరుగుతుందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు తో మా పిల్లల చదువులు కొంత డబ్బు, పోషణ కోసం వాడుతున్నామని, వృద్ధులు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పించను మా కుమారులు సిటీలకు వలస పోయారని వారి పిల్లలు బాగోగులు మరియు మా పోషణకు సరిపోతుందని, మాకు ఆరోగ్యం మందులకు మా పోషణకు సరిపోతుందని, వికలాంగులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మా కుటుంబ పోషణకు, ఆరోగ్య సమస్యలకు సరిపోతుందని మేము ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగాల్సిన అవసరం లేకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్ మాకు ఎంతో ఉపయోగకరమని, ఎన్టీఆర్ పింఛన్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి తెలుగుదేశం నాయకులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు,
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేశంగానే అంజన్న గారు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
