డ్రగ్స్ వద్దు బ్రో

డ్రగ్స్ వద్దు బ్రో
మాదకద్రవ్యాలు సేవించడం వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకొని భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని నల్లమాడ ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. నల్లమడలో వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై ప్రసంగించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా విద్యార్థులు చదువుల్లో బాగా రాణించాలన్నారు. అలా కాకుండా చెడు నేస్తాలతో చెడు అలవాట్లకు అలవాటు పడితే తల్లిదండ్రులు నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. అనంతరం డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు.
జెడ్‌పి హైస్కూల్ విద్యార్థులు మరియు సిబ్బందితో నల్లమడలోని పాఠశాల ఆవరణ నుండి బస్టాండ్ సర్కిల్ వరకు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను మరియు మాదకద్రవ్య రహిత సమాజం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ నినాదాలు చేశారు. మాదకద్రవ్యాల పదార్థాలతో సంబంధం ఉన్న చట్టపరమైన పరిణామాలు మరియు ఆరోగ్య ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నల్లమాడ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor