పొన్నూరు మాజీ ఎమ్మెల్యేకి సీఐడీ నోటీసులు..

వైసీపీ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పొన్నూరుకు చెందిన రేషన్ బియ్యం వ్యాపారి అంజి బర్నబాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో బర్నబాస్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

 

రేషన్ బియ్యం వ్యాపారంలో వైసీపీ నేతలతో ఆయనకు ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయని, ఆ కారణంగానే బర్నబాస్ హత్యకు గురయ్యారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ముఖ్య నాయకుల ఒత్తిడి మేరకు ప్రధాన సూత్రధారులను ఈ కేసులో అరెస్టు చేయలేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

 

అనంతరం ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో బర్నబాస్ కేసు విచారణలో భాగంగా అప్పటి ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు సీఐడీ నోటీసులు అందజేసింది. మంగళవారం సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.

Posted Under AP
Editor