ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు పలు టీచర్లు ధర్నా చేశారు..

ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు పలువురు టీచర్లు ధర్నా చేశారు..ప్రభుత్వ పాఠశాలల మనుగడును ప్రశ్నార్థకం చేస్తున్న పాలకుల విధానాలను ఖండిస్తూ ఈ నిరసన చేశారు.ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల విధానాన్ని అలాగే ఆరు నుంచి 10 వరకు ఉన్నత పాఠశాల విధానాన్ని కొనసాగించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు
అమలులో ఉన్న స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం రాష్ట్రమంతటా ఏకరీతిలో పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితాను తయారు చేయాలన్నారు . జాతీయ విద్యా విధానం మరియు విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న మేరకు అన్ని పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించాలని, సిపిఎస్ జిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెమో 57 ప్రకారం 2003 డిఎస్సి వారికి వెంటనే ఓపిఎస్ అమలు చేయాలని,
12వ పిఆర్సి కమిషన్ వెంటనే నియమించి అయ్యారు ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న మూడు డి ఏ లను ఇవ్వాలని, బకాయిలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బాకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి మురళీకృష్ణ,c ప్రధాన కార్యదర్శి బి బాల సుబ్రహ్మణ్యం, ఆడిట్ కమిటీ రాష్ట్ర నాయకులు కే వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor