15 మంది ఎంపీడీఓలకు పోస్టింగ్స్..

అనంతపురం:

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఖాళీగా ఉన్న 15 మండలాలకు ఎంపీడీఓలను నియమించారు. డిప్యూటీ ఎంపీడీఓలు, ఏవలకు ఇటీవల పదోన్నతి లభించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 10 మందికి పదోన్నతి రాగా, నంద్యాల, కర్నూలు నుంచి ఐదుగురిని పదోన్నతిపై అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు కేటాయించారు. వారందరికీ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ బుధవారం మండలాలకు పోస్టింగ్స్ ఇచ్చారు. వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, ప్లానింగ్, ఎస్టాబ్లిసెంట్ సెక్షన్ ఏ. ఓ లు రత్నాబాయి, నియాజ్ అహ్మద్, జూనియర్ అసిస్టెంట్ లీలావతి పాల్గొన్నారు.

Posted Under AP
Editor