Latest Posts

కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా..!

మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు కేటీఆర్ తరఫున ఆయన న్యాయవాది ఉమామహేశ్వరరావు నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

ఈ పిటిషన్‌లో బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. త‌న ప్ర‌తిష్ఠను దెబ్బ‌తీసేలా కొండా సురేఖ వ్యాఖ్యానించార‌ని కేటీఆర్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

 

మంత్రి కొండా సురేఖ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడాకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువునష్టం దావా వేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా పరువునష్టం దావా వేశారు.

Editor