తాజాగా నోయిడా పోలీసులు ముగ్గురు విదేశీ సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు వేల ఒరిజినల్ డాలర్లు, 1.3 మిలియన్ల నకిలీ డాలర్లు, 10 వేల 500 పౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సదరు నిందితుల నుంచి నటి ఐశ్వర్యరాయ్ నకిలీ పాస్పోర్టులు, ఆరు మొబైల్స్, 11 సిమ్లు, ల్యాప్టాప్, ప్రింటర్, పెన్ డ్రైవ్, 3 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కరుడుకట్టిన నేరస్తులు తమ సహచరులతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడేవారని అంటున్నారు. ఫేస్బుక్లో ఫ్రెండ్స్గా మారి ప్రజలను మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడేవారు. కస్టమ్ ఆఫీసర్లుగా మారి జనం నుంచి డబ్బు దోచేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పుడు తాజాగా పోలీస్ స్టేషన్ బీటా-2 పరిధిలో నివసించే రిటైర్డ్ కల్నల్ను టార్గెట్ చేసుకున్నారు. క్యాన్సర్ మందుల కొనుగోలు పేరుతో రూ.కోటి 81 లక్షలు మోసం చేశారని కల్నల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ
యన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించి నిందితులని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పట్టుకున్న నిందితులను ఐకే ఉఫెరెమ్వుక్వే, ఎడ్విన్ కొల్లిన్స్, ఓకోలోయ్ డామియన్లుగా గుర్తించారు. గ్రేటర్ నోయిడాలోని రాంపూర్ మార్కెట్ సమీపంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితులు పెద్ద పెద్ద సెలబ్రిటీల నకిలీ పాస్పోర్టులను కూడా తయారు చేసేవారని, ఈ కరుడుకట్టిన నేరస్తులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడే వారని అంటున్నారు. వీరు మ్యాట్రిమోనియల్ సైట్, డేటింగ్ యాప్ వంటి అనేక రకాలుగా ద్వారా ఈ నేరగాళ్లు ప్రజలను ట్రాప్ చేసేవారని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా లాటరీ వచ్చిందని మోసం, ఫేస్బుక్ ఫ్రెండ్గా మారి మోసం చేయడం, విదేశాల నుంచి పార్శిల్స్ పంపిస్తామంటూ కస్టమ్ ఆఫీసర్లుగా మారి మోసం చేయడం, సైబర్క్రైమ్లు అనేవి చేసేవారని గుర్తించారు. పేరుమోసిన విదేశీ ఫార్మా కంపెనీ ప్రతినిధి కావడంతో చౌకధరలకు వనమూలికలను కొనుగోలు చేసి, ఖరీదైన ధరలకు విక్రయిస్తామంటూ ప్రజలను మోసం చేసేవారని దాని
