శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరైన స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి సూచించారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని అందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని కోరారు.
నల్లమడలో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభం: ప్లాస్టిక్ రహిత గ్రామాలే లక్ష్యం – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపు!
