Latest Posts

తెలంగాణలో 6 పాజిటివ్‌ కేసులు..19కి చేరిన జే ఎన్ -1 సబ్ వేరియంట్…

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 925 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది.

 

గడిచిన 24 గంటల వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 19 మంది ఐసొలేషన్‌లో ఉన్నారని తెలిపింది . టెస్టులు చేయించిన 54 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

 

 

Editor