టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడలో శెట్టిబలిజ సామాజిక వర్గంతో ఆయన సమావేశయ్యా రు. స్థానిక సంస్థ రిజర్వేషన్లలో బీసీలకు జగన్ ప్రభుత్వం 10 శాతం కోత విధించిందని లోకేష్ మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్, శెట్టిబలిజ కార్పొరేషన్ ఎత్తేశారని, 24 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు.
బీసీలకు రక్షణ చట్టం తెస్తామన్న లోకేష్..
